ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్ట్ సిరీస్లో ఓపెనింగ్ జోడి విషయంలో ఇబ్బంది పడుతోన్న టీమిండియా కొత్త ఓపెనర్లను బరిలోకి దించింది. దేశవాలీలో అద్భుతంగా రాణిస్తోన్న ఇద్దరు యంగ్ బ్యాట్స్మన్లపై కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకముంచి ఓపెనర్లుగా అవకాశమిచ్చాడు. బుధవారం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. #India #Vihari #Agarwal