మూడు టీ20ల సిరిస్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ తరుపున ధోని(39) ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ధోని అత్యధిక పరుగులు సాధించిన ప్రతి మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధోని అజేయంగా 48 పరుగులతో నౌటాట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. #India #NewZealand #MsDhoni #1stT20I