ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరిస్ను కైవసం చేసుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్పై కన్నేసింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. చివరి రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్కు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు. #India #NewZealand #RohitSharma #T20I #RareRecord