టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాలు తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో కలిసి ఆడనున్నారు. ఇందుకు న్యూజిలాండ్తో జరిగే మూడు టీ20ల సిరీస్ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్క మ్యాచ్లో కూడా అడలేదు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. #India #NewZealand #HardikPandya #KrunalPandya #1stT20I #PandyaBrothers