భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో..? అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. రెప్పపాటులో స్టంపౌట్ చేయడం క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమే. తాజాగా హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్లోనూ ఓపెనర్ సీఫర్ట్ని ధోనీ ఇలానే స్టంపౌట్ చేశాడు. #IndiaVsNewZealand #MSDhoni #3rdT20I #IndianFlag